‘వీధి రౌడీలా దాడి చేసిన ఎమ్మెల్యే జోగి ’

ABN , First Publish Date - 2021-09-19T04:59:55+05:30 IST

కాకినాడ సిటీ, సెప్టెంబరు 18: మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై వీధి రౌడీలా దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమే్‌షపై అనర్హత వేటు వేయాలని టీడీపీ కాకినాడ పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేగా జోగి తన గౌరవాన్ని

‘వీధి రౌడీలా దాడి చేసిన ఎమ్మెల్యే జోగి ’

కాకినాడ సిటీ, సెప్టెంబరు 18: మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై వీధి రౌడీలా దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమే్‌షపై అనర్హత వేటు వేయాలని టీడీపీ కాకినాడ పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేగా జోగి తన గౌరవాన్ని కాపాడుకోవాలని, దౌర్జన్యాలకు పాల్పడుతూ కొత్త సంస్కృతికి తెరతీసిన ఆయనకు ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదన్నారు. మాజీ సీఎం ఇంటి మీద దాడికి పాల్పడితే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దాడి చేసిన గూండాలపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాసబాబా డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు కొల్లాబత్తుల అప్పారావు, కొండ వినాయక్‌, విత్తనాల గోపాల్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-19T04:59:55+05:30 IST