ప్రోటోకాల్ వివాదం... వైసీపీ నేతల ఆందోళన

ABN , First Publish Date - 2021-11-08T20:53:31+05:30 IST

జిల్లాలోని వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో ప్రోటోకాల్ వివాదం చోటుచేసుకుంది. అంగన్వాడి భవనం, సొసైటీ భవన ప్రారంభోత్సవానికి టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులను అధికారులు ఆహ్వానించారు.

ప్రోటోకాల్ వివాదం... వైసీపీ నేతల ఆందోళన

పశ్చిమగోదావరి: జిల్లాలోని వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో ప్రోటోకాల్ వివాదం చోటుచేసుకుంది. అంగన్వాడి భవనం, సొసైటీ భవన ప్రారంభోత్సవానికి టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులను అధికారులు ఆహ్వానించారు. వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌తో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే రాకముందే భవనాలను  టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. పసుపు నీళ్లతో శుద్ధిచేసి వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తిరిగి ప్రారంభించారు. టీడీపీ, జనసేన నేతలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-11-08T20:53:31+05:30 IST