బీజేపీ నేతలకు YCP MLA Dwarampudi హెచ్చరిక

ABN , First Publish Date - 2022-05-04T16:58:41+05:30 IST

బీజేపీ నేతలకు కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరికలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.

బీజేపీ నేతలకు YCP MLA Dwarampudi హెచ్చరిక

కాకినాడ: బీజేపీ నేతలకు కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరికలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఓ మసీదుకు స్థలం కేటాయింపుపై బీజేపీ కబ్జా అంటూ ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో ముస్లిం సోదరులు తల్చుకుంటే.. అంటూ హెచ్చరించారు. బీజేపీలో ఉన్న కార్యకర్తలు బహు తక్కువమంది అని.... వాళ్లు అతిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఓ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ద్వారంపూడి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. స్థలంపై బీజేపీ రాజకీయం చేస్తే తాము కూడా ఇంకో రకంగా రాజకీయం చేయాల్సి ఉంటుందని అన్నారు. కోర్టులో ఉన్న వివాదంపై ఎమ్మెల్యే ద్వారంపూడి హెచ్చరికలు చర్చనీయాంశంగా మారాయి. 

Read more