Pawan Kalyanకు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి కౌంటర్.. నా జోలికొస్తే...

ABN , First Publish Date - 2022-03-15T18:08:21+05:30 IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ సభలో తనపై అవాకులు చెవాకులు పేలారని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

Pawan Kalyanకు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి కౌంటర్.. నా జోలికొస్తే...

  • కాకినాడలో మమ్మల్ని ఎవరూ ఏం పీకలేరు

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ సభలో తనపై అవాకులు చెవాకులు పేలారని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... సినిమాలు వేరు, రాజకీయాలు వేరని పవన్‌ గుర్తించాలన్నారు. సభలు పెట్టడం, ప్యాకేజీ మాట్లాడుకోవడం పవన్‌కు అలవాటే అని విమర్శించారు. పవన్ అందరికీ నీతులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. దమ్ముంటే పవన్‌ ఒంటరిగా పోటీ చేయాలని ఎమ్మెల్యే సవాల్ చేశారు.



టీడీపీ అధినేత చంద్రబాబుతో పొత్తుకెళ్తే పవన్‌కే నష్టమన్నారు. ‘‘జనసేనలో కొందరు లక్షలు ఖర్చు చేస్తున్నారు...మీరు లక్షలు ఖర్చు చేసినా పవన్‌ మిమ్మల్నీ తాకట్టు పెడతాడు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. పవన్‌ వ్యక్తిగత దూషణలకు మాత్రమే ప్రాధాన్యతిస్తున్నారని అన్నారు. ‘‘నా జోలికి వస్తే క్షమించేది లేదు, మేము చూస్తూ ఊరుకొనేది లేదు.. మీ నాయకులు, కార్యకర్తలు మా ఇంటిపైకి వస్తే చూస్తూ ఊరుకొము. చేతులు ముడుచుకు కూర్చొము. మళ్ళీ చెపుతున్న మమ్మల్ని కాకినాడలో ఒక వెంట్రుక గాని, ఈక గాని పీకలేరు’’ అంటూ ద్వారంపూడి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-03-15T18:08:21+05:30 IST