చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2020-07-05T00:45:31+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం లేదన్నారు.
చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం లేదన్నారు. మూడు రాజధానుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని చెప్పారు. అమరావతిలో ఉన్న బినామీ భూములు పోతాయని చంద్రబాబు భయమని విమర్శించారు. బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ సభ్యులు రెచ్చగొట్టడం వల్లే మా వాళ్లు కొట్టారని ఎంఎస్ బాబు తెలిపారు.