వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2020-02-17T01:50:22+05:30 IST

ట్విట్టర్ వేదికగా వైసీపీ నేతల తీరుపై మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఐటీ సోదాలపై అబద్ధాలు ప్రచారం చేసిన

వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన అచ్చెన్నాయుడు

అమరావతి: ట్విట్టర్ వేదికగా వైసీపీ నేతల తీరుపై మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఐటీ సోదాలపై అబద్ధాలు ప్రచారం చేసిన వైసీపీ నాయకులు, వారి అవినీతి మీడియాను చూస్తుంటే ‘ఊ పె కు హ’ అనే మొరటు సామెత గుర్తొస్తుందటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రూ.2వేల కోట్ల అవినీతి సొమ్ము దొరికేసిందని గగ్గోలు పెట్టిన వాళ్లందరికీ ఈరోజు ఐటీ అధికారులు విడుదల చేసిన పంచనామా పత్రాలు చెంపపెట్టులాంటివని అన్నారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా ఇన్నాళ్లు రూ.2వేల కోట్ల అబద్ధాన్ని ప్రచారం చేయడానికి మంత్రి బొత్స సత్యనారాయణ ఆవేశం చూసి మైకులకు కూడా పూనకం వచ్చేసిందని అన్నారు. కానీ చివరికి మంత్రికి ఆయాసమే మిగిలిందని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతల అవినీతి రొచ్చును తెలుగుదేశం మీద వేద్దాం అనుకుంటే చివరికి మిగిలేది కృష్ణ జన్మస్థానమే అని వైసీపీ నేతలను అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Updated Date - 2020-02-17T01:50:22+05:30 IST