రికార్డింగ్ డ్యాన్సర్లతో వైసీపీ నాయకుల చిందులు

ABN , First Publish Date - 2022-02-15T17:56:56+05:30 IST

హిందూపురంలో వైసీపీ నేతల ఆధ్వర్యంలో రికార్డింగ్ డ్యాన్సులు జోరుగా సాగుతున్నాయి.

రికార్డింగ్ డ్యాన్సర్లతో వైసీపీ నాయకుల చిందులు

అనంతపురం జిల్లా: హిందూపురంలో వైసీపీ నేతల ఆధ్వర్యంలో రికార్డింగ్ డ్యాన్సులు జోరుగా సాగుతున్నాయి. డ్యాన్సర్లతో అదికార పార్టీ నేతలు చిందులు వేస్తున్న దృశ్యాలను స్థానికులు వారి సెల్ ఫోన్‌లలో బంధించారు. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.


హిందూపురం నియోజకవర్గం పరిధిలో ఎల్ఆర్జీ విద్యా సంస్థల అధినేత బాలకృష్ణన్ విగ్రహావిష్కరణకు వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ అహ్మద్‌తో పాటు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, స్థానిక వైసీపీ నేతలు హాజరయ్యారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీంతో వైసీపీ నేతలు ఒక్కసారిగా స్టేజ్ పైకి ఎక్కి డ్యాన్సర్లతో చిందులు వేశారు. వైసీపీ నేతల తీరును అక్కడివారంతా విమర్శించారు. కొంతమంది కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు.

Updated Date - 2022-02-15T17:56:56+05:30 IST