హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ముట్టడికి వైసీపీ నేతల యత్నం

ABN , First Publish Date - 2021-10-20T00:12:02+05:30 IST

హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ముట్టడికి వైసీపీ నేతల యత్నించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి‌పై..

హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ముట్టడికి వైసీపీ నేతల యత్నం

అనంతపురం: హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ముట్టడికి వైసీపీ నేతల యత్నించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి‌పై  టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యలను నిరసిస్తూ బాలకృష్ణ ఇంటి ముందు బైఠాయించారు. బాలకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 


మరోవైపు  ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగారు. పక్కా ప్రణాళికతో టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేశారు. గేట్లు నెట్టుకొని టీడీపీ కేంద్ర కార్యాలయం లోపలికి వైసీపీ శ్రేణులు వెళ్లారు. కార్యాలయంలో కనపడినవారిపై దాడి, అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు. విశాఖ, తిరుపతి, గుంటూరులోని టీడీపీ కార్యాలయాలపైనా వైసీపీ శ్రేణులు దాడులు చేశారు. టీడీపీ నేత పట్టాభి నివాసంపై కూడా దాడి జరిగింది. పలు విలువైన వస్తువులు ధ్వంసం చేశారు.







Updated Date - 2021-10-20T00:12:02+05:30 IST