YCP Leaders: రాజుపాలెంలో వైసీపీ నేతల దౌర్జన్యం

ABN , First Publish Date - 2022-08-08T17:46:55+05:30 IST

జిల్లాలోని బద్వేల్ మండలం రాజుపాలెంలో వైసీపీ నేతలు (YCP leaders) దౌర్జన్యానికి పాల్పడ్డారు.

YCP Leaders: రాజుపాలెంలో వైసీపీ నేతల దౌర్జన్యం

కడప: జిల్లాలోని బద్వేల్ మండలం రాజుపాలెంలో వైసీపీ నేతలు (YCP leaders) దౌర్జన్యానికి పాల్పడ్డారు. భూవివాదాలతో టీడీపీ (TDP)కి చెందిన చంద్రశేఖర్రెడ్డి (Chandrashekar reddy) కుటుంబసభ్యులపై వైసీపీ నేత నరసింహారెడ్డి (Narasimha reddy), అనుచరులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వెంటనే బాధితులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చంద్రశేఖర్రెడ్డి కోర్టు నుంచి స్టే తెచ్చుకుని  పొలంలో మొక్కలు నాటుతుండగా  వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-08-08T17:46:55+05:30 IST