వైసీపీ నాయకులు టీడీపీలో చేరిక

ABN , First Publish Date - 2021-04-13T05:21:16+05:30 IST

మండలంలోని వాకాడులో రెడ్డి, బీసీ వర్గానికి చెందిన నాయకులు సోమవారం మండలాధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో యల్లంటి సుబ్రహ్మణ్యంరెడ్డి, సంగీతం సుధాకర్‌లను తెలుగుదేశంపార్ట్టీలోకి ఆహ్వానించారు.

వైసీపీ నాయకులు టీడీపీలో చేరిక
వైసీపీ నాయకులను టీడీపీలోకి ఆహ్వానిస్తున్న దువ్వూరు మధుసూదన్‌రెడ్డి

వాకాడు ఏప్రిల్‌ 12 : మండలంలోని వాకాడులో రెడ్డి, బీసీ వర్గానికి చెందిన నాయకులు సోమవారం మండలాధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో యల్లంటి సుబ్రహ్మణ్యంరెడ్డి, సంగీతం సుధాకర్‌లను తెలుగుదేశంపార్ట్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడు, మాజీ శాసనసభ్యుడు పాశం సునీల్‌కుమార్‌ల నాయకత్వంపై నమ్మకంతో టీడీపీ నాయకులు పలువురు పార్టీలో చేరుతున్నారన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరిగేలా తెలుగుదేశంపార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, తెలుగుయువత అధ్యక్షుడు కె. దయాకర్‌, గూడూరు నియోజకవర్గం రైతు అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, గంగాధర్‌రెడ్డి, అన్నమేడు చంద్రయ్య, గౌస్‌బాషా, ప్రభాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-13T05:21:16+05:30 IST