మద్యం పంపిణీలో వైసీపీ నేతలు?
ABN , First Publish Date - 2021-03-05T21:31:34+05:30 IST
జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగరలంలో మద్యాన్ని విచ్చలవిడిగా పంపిణీ
విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగరంలో మద్యాన్ని విచ్చలవిడిగా పంపిణీ చేయడానికి వైసీపీ నేతలు సిద్ధమయ్యారు. ముఖ్యంగా 47వ వార్డులో మద్యాన్ని గుట్టుగా పంపిణీ చేయడానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 47వ వార్డు నుంచి పోటీ చేస్తున్న వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కాంటిపాము కామేశ్వరి భర్త, వారి కుటుంబ సభ్యులు, అనుచరులు మద్యం పంపిణీకి ఏర్పాట్లు చేశారు. వైసీపీ నేతలు మద్యాన్ని రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
గత అర్థరాత్రి కారు, ఆటోలలో మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే కారు కింద పోలీస్ అని రాసి ఉండటంతో ఈ సంఘటన నగరంలో కలకలం రేపుతోంది. మద్యాన్ని పోలీసులు సీజ్ చేసి కంచరపాలెం పోలీస్స్టేషన్కు తరలించారు.