నడిరోడ్డుపై YCP leaders డిష్యూం... డిష్యూం

ABN , First Publish Date - 2022-06-24T19:51:12+05:30 IST

జిల్లాలోని హిందూపురంలో నడిరోడ్డుపై వైసీపీ నేతల ఘర్షనకు పాల్పడ్డారు.

నడిరోడ్డుపై YCP leaders డిష్యూం... డిష్యూం

శ్రీ సత్యసాయి: జిల్లాలోని హిందూపురంలో నడిరోడ్డుపై  వైసీపీ నేతల ఘర్షణకు పాల్పడ్డారు. ప్రెస్‌క్లబ్ వద్ద ఎమ్మెల్సీ ఇక్బాల్, మాజీ సమన్వయకర్త రామక్రిష్ణారెడ్డి వర్గీయులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఇక్బాల్‌కు వ్యతిరేకంగా  రామక్రిష్ణారెడ్డి వర్గీయులు ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ప్రెస్‌మీట్ పెట్టకూడదంటూ ఎమ్మెల్సీ వర్గం అడ్డుకుంది. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల సమక్షంలోనే ఇరువర్గాల నేతలు దాడి చేసుకున్నారు. 

Updated Date - 2022-06-24T19:51:12+05:30 IST