వైసీపీ నేతల అరాచకం.. ఇళ్లు వదిలి వెళ్లిపోయిన టీడీపీ కుటుంబాలు

ABN , First Publish Date - 2020-06-07T03:18:31+05:30 IST

వత్సవాయి మండలం తాళ్లురులో వైసీపీ నేత అరాచకం బయటపడింది. టీడీపీకి చెందినవారి గృహాలపై...

వైసీపీ నేతల అరాచకం.. ఇళ్లు వదిలి వెళ్లిపోయిన టీడీపీ కుటుంబాలు

కృష్ణా: వత్సవాయి మండలం తాళ్లూరులో వైసీపీ నేత అరాచకం బయటపడింది. టీడీపీకి చెందిన వారి గృహాలపై వైసీపీ శ్రేణుల దాడి చేశాయి. తాళ్లూరు మాజీ సర్పంచ్‌ ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. అప్పటి నుంచి ఆక్రోశం పెంచుకున్న వైసీపీ నేతలు.. టీడీపీకి చెందిన కుటుంబాలపై దాడి చేశారు. గ్రామంలో ఉండాలంటే వైసీపీలో చేరాలని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో టీడీపీకి చెందిన కుటుంబాలు ఇళ్లు వదిలి వెళ్లిపోయాయి. వైసీపీ నేతల తీరుపై మండిపడ్డాయి. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. 

Updated Date - 2020-06-07T03:18:31+05:30 IST