పేరు తెలీయకుండానే ఆందోళన.. తప్పులో కాలేసిన వైసీపీ నేతలు!
ABN , First Publish Date - 2021-10-21T06:54:47+05:30 IST
సీఎం జగన్పై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దుర్భాషలు చేశారని స్ధానిక వైసీపీ నాయకులు చేపట్టిన నిరసనలో తప్పులో కాలేశారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు నిరసన తెలిపేందుకు ఓ ఫ్లెక్సీని ఏర్పాటుచేశారు.
అంబాజీపేట, అక్టోబరు 20: సీఎం జగన్పై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దుర్భాషలు చేశారని స్ధానిక వైసీపీ నాయకులు చేపట్టిన నిరసనలో తప్పులో కాలేశారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు నిరసన తెలిపేందుకు ఓ ఫ్లెక్సీని ఏర్పాటుచేశారు. ఈ ఫ్లెక్సీలో టీడీపీ అధికార ప్రతినిధి పేరు బదులు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రాబ్యాంక్ వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభిసీతారామయ్య పేరుతో ప్రచురించారు. ఆయన పేరుతో నిరసన తెలియజేస్తూ పట్టాభిసీతారామయ్య డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో టీడీపీ అధికార ప్రతినిధి పేరు తెలియకుండానే వైసీపీ నేతలు నిరసన తెలియజేస్తున్నారా అని పలువురు విమర్శించారు. స్వయంగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు హాజరైన పి గన్నవరంలోనూ ఇదే పేరుతో ఫ్లెక్సీ వేశారు.