రెచ్చిపోయిన వైసీపీ నాయకులు.. బీజేపీ అభ్యర్థిపై కత్తులతో దాడి

ABN , First Publish Date - 2020-07-14T02:25:03+05:30 IST

వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. అధికారం బలం చూసుకుని ప్రతిపక్షపార్టీలపై దాడులకు తెగబడుతున్నారు. 21వ డివిజన్‌కు..

రెచ్చిపోయిన వైసీపీ నాయకులు.. బీజేపీ అభ్యర్థిపై కత్తులతో దాడి

విజయనగరం: వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. అధికారం బలం చూసుకుని ప్రతిపక్షపార్టీలపై దాడులకు తెగబడుతున్నారు. 21వ డివిజన్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్ అభ్యర్ధి కాళ్ల నారాయణరావుపై వైసీపీ నాయకులు కత్తులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో నారాయణరావుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే నారాయణరావు పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. వైసీపీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కూడా తిరగబడితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. 

Updated Date - 2020-07-14T02:25:03+05:30 IST