తిక్కారెడ్డిపై వైసీపీ మూకల దాడిపై చంద్రబాబు ఆగ్రహం

ABN , First Publish Date - 2021-12-12T04:10:09+05:30 IST

తిక్కారెడ్డిపై వైసీపీ మూకల దాడిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్షనిస్టులు రెచ్చిపోతుంటే పోలీసులు నిద్రపోతున్నారా..

తిక్కారెడ్డిపై వైసీపీ మూకల దాడిపై చంద్రబాబు ఆగ్రహం

అమరావతి: తిక్కారెడ్డిపై వైసీపీ మూకల దాడిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్షనిస్టులు రెచ్చిపోతుంటే పోలీసులు నిద్రపోతున్నారా అని మండిపడ్డారు. సీఎం ప్రోద్బలంతోనే టీడీపీ నేతలపై దాడులు పెరిగాయని, తమ కార్యకర్తలు తిరగబడితే పరిస్థితులు వేరేలా ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు. ‘‘శాంతిభద్రతలు కాపాడలేకపోతే డీజీపీ రాజీనామా చేసి వెళ్లిపోవాలి. తిక్కారెడ్డి, అనుచరులపై వైసీపీ మూకల దాడి హేయం. సీఎం జగన్‌ ప్రోద్బలంతోనే తిక్కారెడ్డిపై హత్యాయత్నం. పట్టపగలు హత్యాయత్నం చేస్తుంటే పోలీసులు నిద్రపోతున్నారా?. గతంలో తిక్కారెడ్డిపై రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయి. అయినా రక్షణ కల్పించలేదంటే అర్థం ఏమిటి?. వైసీపీ అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. జగన్ అధికారం చేపట్టాక టీడీపీ శ్రేణులపై 1450 దాడులు. 23 మందిని పొట్టన పెట్టుకున్నారు. వైసీపీ దాడులపై న్యాయ విచారణ చేయించాలి. దాడికి పాల్పడిన వారిని అరెస్టుచేసి తిక్కారెడ్డికి రక్షణ కల్పించాలి.’’ అని చంద్రబాబు సూచించారు.  

Updated Date - 2021-12-12T04:10:09+05:30 IST