టీడీపీ నేతపై వైసీపీ నాయకుల దాడి
ABN , First Publish Date - 2020-06-06T09:42:28+05:30 IST
కనిగిరి మండల పరిఽధిలోని వాగుపల్లి సచివాలయం వద్ద శుక్రవారం టీడీపీ నేత, మా జీ సర్పంచ్ భార్యపై
కనిగిరి టౌన్, జూన్ 5 : కనిగిరి మండల పరిఽధిలోని వాగుపల్లి సచివాలయం వద్ద శుక్రవారం టీడీపీ నేత, మా జీ సర్పంచ్ భార్యపై వైసీపీ నాయకులు దాడి చేశారు. వాగుపల్లి మాజీ సర్పంచ్ భార్య ఎస్తేరమ్మకు భర్త చనిపోవడంతో వితంతు పింఛన్ నమోదు కోసం తన మరిది, మాజీ ఉప సర్పంచ్ దానియేలుతో వాగుపల్లి సచివాలయం వద్దకు వెళ్లారు.
అక్కడ వారు వితంతు పింఛన్ కోసం నమోదు చేసుకుంటుండగా వైసీపీ నాయకులు మూకుమ్మడిగా కులం పేరుతో దూషిస్తూ మీ పెత్తనం ఇక్కడేందంటూ మూలే గోవిందరెడ్డి, మూలే వెంకటేశ్వరరెడ్డి, మూలే శివారెడ్డి, వీరం రెడ్డి సురే్షబాబు, బాలకృష్ణ, మేడం శ్రీనివాసులరెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు తమపైదాడి చేశారని బాధితులు తెలిపారు. గాయాలపాలైన కత్తి దానియేలు, కత్తి ఎస్తేరమ్మ కనిగిరి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న సీఐ వెంకటేశ్వరరావు వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను విచారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.