నిమిషాల్లో దొరికిన వారిని దొరికినట్టు చితక్కొట్టిన వైసీపీ గ్యాంగ్

ABN , First Publish Date - 2022-06-28T19:56:38+05:30 IST

ధర్మవరం ప్రెస్ క్లబ్‌లో బీజేపీ నేతలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. కట్టెలు రాడ్లు చేతిలో పట్టుకుని స్కోర్పియో వాహనాల్లో..

నిమిషాల్లో దొరికిన వారిని దొరికినట్టు చితక్కొట్టిన వైసీపీ గ్యాంగ్

శ్రీ సత్యసాయి : ధర్మవరం ప్రెస్ క్లబ్‌లో బీజేపీ నేతలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. కట్టెలు రాడ్లు చేతిలో పట్టుకుని స్కోర్పియో వాహనాల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అనుచరులు వచ్చారు. ముందస్తు ప్లాన్ ప్రకారం బీజేపీ నేతలపై దాడికి పాల్పడ్డారు. దాడిని పక్కదోవ పట్టించడంలో భాగంగా ఎల్లో కలర్ షర్ట్స్ వేసుకుని వైసీపీ గ్యాంగ్ రావడం గమనార్హం. అయితే బీజేపీ నేతలు దాడికి పాల్పడిన వారిని గుర్తించారు. ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ముఖ్య అనుచరుడు గొట్లూరు మారుతీ మనుషులుగా చెబుతున్నారు. ఐదు నిమిషాల్లో దొరికిన వారిని దొరికినట్లు వైసీపీ గ్యాంగ్ చితక్కొట్టింది. రోడ్డుపై ఉన్న బీజేపీ నేతలపై వెంటపడి రాడ్లతో దాడికి పాల్పడ్డారు.

Updated Date - 2022-06-28T19:56:38+05:30 IST