‘పుష్ప’ పాటకు డ్యాన్స్‌ వేసిన వైసీపీ నేత

ABN , First Publish Date - 2022-01-18T02:28:43+05:30 IST

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురంలో ఆదివారం రాత్రి ఓ వైసీపీ నేత యువతులతో కలిసి చిందులేశారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సొంత గ్రామమైన రాంపురంలో

‘పుష్ప’ పాటకు డ్యాన్స్‌ వేసిన వైసీపీ నేత

కర్నూలు: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురంలో ఆదివారం రాత్రి ఓ వైసీపీ నేత యువతులతో కలిసి చిందులేశారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సొంత గ్రామమైన రాంపురంలో రామలింగేశ్వరస్వామి జాతర ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం రామలింగేశ్వరస్వామిని రథోత్సవం వైభవంగా సాగింది. రథోత్సవం అనంతరం ఆదివారం రాత్రి రికార్డింగ్‌ డ్యాన్స్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ మండల నాయకుడు యువతులతో కలిసి పుష్ప చిత్రంలోని ఓ పాటకు కాసేపు డ్యాన్స్‌ చేశారు. అక్కడే ఉన్న వైసీపీ కార్యకర్తలు ఈలలు, కేకలు వేస్తూ ఆ నాయకుడ్ని ఉత్సాహపరిచారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆ నాయకుడ్ని మందలించినట్లు సమాచారం. 

Updated Date - 2022-01-18T02:28:43+05:30 IST