సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వైసీపీ నేత సంభాషణ

ABN , First Publish Date - 2021-10-24T22:13:33+05:30 IST

సోషల్ మీడియాలో వైసీపీ నేత సంభాషణ వైరల్‌గా మారింది. వైసీపీ ఎంపీటీసీగా ఓడిపోయిన అభ్యర్థి మరో వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడారు.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వైసీపీ నేత సంభాషణ

ఏలూరు: సోషల్ మీడియాలో వైసీపీ నేత సంభాషణ వైరల్‌గా మారింది. వైసీపీ ఎంపీటీసీగా ఓడిపోయిన అభ్యర్థి మరో వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడారు. వైసీపీకి ఓట్లు వేస్తేనే పథకాలు ఉంటాయని వైసీపీ నేత చెప్పారు. టీడీపీకి సపోర్ట్ చేస్తామంటే పథకాలు పీకేస్తామని హెచ్చరించారు. జగనన్న ఇళ్ల స్థలాలు ఇచ్చినా తకు సపోర్ట్ చేయకుండా.. టీడీపీకి ఓట్లు వేస్తే ఊరుకుంటామా అంటూ వైసీపీ నేత బెదిరింపులకు దిగారు. ఉండి మండలం కలిగొట్లలో వైసీపీ నేత ఆడియో వైరల్‌గా మారింది.

Updated Date - 2021-10-24T22:13:33+05:30 IST