ఇదంతా ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడానికే: విజయ్ ప్రసాద్
ABN , First Publish Date - 2022-01-29T01:58:23+05:30 IST
జిల్లాలోని పెందుర్తిలో జరిగిన ఘటనలో ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడానికే
విశాఖపట్నం: జిల్లాలోని పెందుర్తిలో జరిగిన ఘటనలో ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడానికే ఇదంతా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, పశ్చిమ నియోజక వర్గం వైసీపీ ఇంచార్జి మళ్ల విజయ్ ప్రసాద్ అన్నారు. పెందుర్తిలో రెవిన్యూ సిబ్బందిపై వైసీపీ నేత దొడ్డికిరణ్ జరిపిన దాడిపై ఆయన స్పందించారు. ఆక్రమణల తొలగింపునకు వెళ్లేముందు పోలీసు ఎస్కార్ట్ను అధికారులు ఎందుకు తీసుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. సిబ్బంది ఎందుకు ప్రొసీజర్ ఫాలో అవ్వలేదన్నారు. ఆరుమాసాల క్రితం సరిహద్దు నిర్మించారని ఆయన పేర్కొన్నారు. నోటీసులు ఇవ్వకుండా తొలగింపులు ఎలా చేపడతారని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనలో సిబ్బందికి చిన్నగాయమైనా అయ్యిందా అని నిలదీశారు.ఎవరైనా వైద్య చికిత్స చేయించుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. మీడియాలో వచ్చిన దృశ్యాల్లో పక్కన ఉన్నవారు విడిపిస్తున్నారే తప్ప దాడి చేస్తున్నట్లు లేదన్నారు
ప్రభుత్వాన్ని బద్నామ్ చేయాలనే ఇదంతా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.