సోషల్ మీడియాలో వైసీపీ నేత బూతు పురాణం వైరల్
ABN , First Publish Date - 2021-12-16T02:27:43+05:30 IST
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇలాకలోని చేజర్ల మండలం మడపల్లిలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. మడపల్లి సచివాలయంలో..
నెల్లూరు: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇలాకలోని చేజర్ల మండలం మడపల్లిలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. మడపల్లి సచివాలయంలో సర్వేయర్గా పని చేస్తున్న సురేశ్ను వైసీపీ నేత భాస్కర్ రెడ్డి బూతులు తిడుతూ బెదిరించారు. గ్రామంలో మురికి కాలువ సమస్యపై సర్వేయర్కు ఫోన్ చేసి భాస్కర్ రెడ్డి దూషించారు. ఇప్పుడు ఈ ఆడియో వైరల్ అవుతోంది. స్థానిక వైసీపీ నేత బూతు పురాణంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.