వైసీపీ నేత సుభానీపై సుబ్బారావు గుప్తా ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-12-21T03:46:50+05:30 IST
వైసీపీ నేత సుభానీపై సుబ్బారావు గుప్తా ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంత్రులు ఎమ్మెల్యేలపై...
ప్రకాశం: వైసీపీ నేత సుభానీపై సుబ్బారావు గుప్తా ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సుబ్బారావు గుప్తాపై సుభానీ దాడికి పాల్పడ్డారు. దీంతో ఆర్యవేశ్య సంఘ నేతలతో కలిసి సుబ్బారావు గుప్తా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అనంతరం సుబ్బారావు గుప్తాను కుటుంబ సభ్యులు మంత్రి బాలినేని వద్దకు విజయవాడ తీసుకువెళ్లారు. తన కుటుంబం సురక్షితంగా ఉందని సుబ్బారావు గుప్తా మీడియాకు తెలిపారు. తన జోలికి వస్తే పోలీసులు చూసుకుంటారని హామీ ఇచ్చారని సుబ్బారావు తెలిపారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన సమస్యను పరిష్కారిస్తారని సుబ్బారావు గుప్తా చెప్పారు.