వైసీపీ నాయకుడి వద్ద రూ. 25 లక్షల మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2020-06-06T10:18:54+05:30 IST

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామంలో వైసీపీ నాయకుడి వద్ద భారీగా మద్యం నిల్వలను అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో విజయవాడ అడిషనల్‌ ఎస్పీ సత్తిబాబు

వైసీపీ నాయకుడి వద్ద రూ. 25 లక్షల మద్యం స్వాధీనం

మంతెన (కంకిపాడు), జూన్‌ 5: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామంలో వైసీపీ నాయకుడి వద్ద భారీగా మద్యం నిల్వలను అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో విజయవాడ అడిషనల్‌ ఎస్పీ సత్తిబాబు మాట్లాడుతూ... మంతెనగ్రామానికి చెందిన వీరంకి వెంకటరమణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతను ఇచ్చిన సమాచారంతో మంతెన-ఉప్పలూరు గ్రామాల సరిహద్దులో సుమారు రూ.25 లక్షల విలువైన 150 మద్యం కేసులను స్వాధీనం చేసుకున్నామన్నారు. 

Updated Date - 2020-06-06T10:18:54+05:30 IST