వైసీపీ నేత దౌర్జన్యం.. రోడ్డున పడ్డ దళిత టీచర్ కుటుంబం
ABN , First Publish Date - 2022-06-18T18:00:22+05:30 IST
వైసీపీ నేత దౌర్జన్యంతో న్యాయం కోసం దళిత టీచర్ కుటుంబం రోడ్డున పడింది.
గుంటూరు: వైసీపీ నేత దౌర్జన్యంతో న్యాయం కోసం దళిత టీచర్ కుటుంబం రోడ్డున పడింది. తమ ఇంటికి దారి లేకుండా వైసీపీ నేత గోడ కట్టించాడు. ఈ విషయంపై స్థానికంగా ఉన్న అందరు అధికారులకు కుటుంబసభ్యులు విన్నకుంచుకున్నా ఫలితం శూన్యంగా మారింది. దీంతో తమకు న్యాయం చేయాలంటూ ముగ్గురు పిల్లలతో కలసి వీల్ చైర్లో టీచర్ సుధారాణి నడక ప్రారంభించారు. ప్రకాశం జిల్లా బొడ్డువానిపాలెం నుంచి తాడేపల్లి సీఎం ఆఫీస్ వరకు నడకగా వెళ్లనున్నారు.