వైసీపీ నేతల అరాచకాలు శ్రుతి మించిపోతున్నాయి: నాదెండ్ల మనోహర్

ABN , First Publish Date - 2021-04-28T21:31:05+05:30 IST

జనసేన మద్దతుదారులు గెలిచారనే అక్కసుతో దాడులు చేయడం సరి కాదని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ దుయ్యబట్టారు.

వైసీపీ నేతల అరాచకాలు శ్రుతి మించిపోతున్నాయి: నాదెండ్ల మనోహర్

అమరావతి: జనసేన మద్దతుదారులు గెలిచారనే అక్కసుతో దాడులు చేయడం సరి కాదని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తూర్పు గానుగూడెంలో జనసేన నాయకులు, కార్యకర్తలపై దాడి అమానుషమని తప్పుబట్టారు. వైసీపీ వాళ్లు చేస్తున్న దాడులు, అరాచకాలు శ్రుతి మించిపోతున్నాయని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని తప్పుబట్టారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు దాడి చేసిన వారిని అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని  నాదెండ్ల మనోహర్‌ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-04-28T21:31:05+05:30 IST