రైలు పట్టాలపై కుప్పం వైసీపీ నేత మృతదేహం

ABN , First Publish Date - 2022-04-08T01:49:09+05:30 IST

చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ నాయకుడు, గంగమాంబ ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు ఎన్‌.పార్థసారథి గురువారం ఉదయం రైలుపట్టాలపై శవమై తేలడంతో

రైలు పట్టాలపై కుప్పం వైసీపీ నేత మృతదేహం

కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ నాయకుడు, గంగమాంబ ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు ఎన్‌.పార్థసారథి గురువారం ఉదయం రైలుపట్టాలపై శవమై తేలడంతో పట్టణంలో సంచలనంగా మారింది. వైసీపీ స్థానిక నాయకుల వేధింపుల వల్లే ఆయన చనిపోయారనే ఆరోపణలు భగ్గుమన్నాయి. దీనిని ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేయడంతో, ఇది రాజకీయ హత్యే అంటూ వాల్మీకి బోయ సంఘానికి చెందినవారు పెద్ద సంఖ్యలో కుప్పం పోలీస్‌ స్టేషన్‌ దగ్గరకు చేరుకుని నిరసన తెలిపారు. అధికారపార్టీ స్థానిక నాయకులు మానసిక క్షోభకు గురిచేయడం వల్లే ఆయన మరణించారని ఆరోపించారు. తమ సోదరుడి మరణంపై అనుమానాలున్నాయని విచారణ జరపాలని పార్థసారథి సోదరుడు కార్తీక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కుప్పం గ్రామ పంచాయతీలో మూడుసార్లు వార్డు మెంబర్‌గా గెలుపొందిన పార్థసారధి, వైసీపీ కుప్పం పట్టణ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. 

Updated Date - 2022-04-08T01:49:09+05:30 IST