టీటీడీలో పరిపాలనపై మోహన్ బాబు కామెంట్..
ABN , First Publish Date - 2021-01-14T15:48:26+05:30 IST
సంక్రాంతిని పురస్కరించుకుని ప్రజలందరికీ ప్రముఖ నటుడు, వైసీపీ నేత మంచు మోహన్ బాబు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
తిరుమల: సంక్రాంతిని పురస్కరించుకుని ప్రజలందరికీ ప్రముఖ నటుడు, వైసీపీ నేత మంచు మోహన్ బాబు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగకు స్వగ్రామానికి వెళ్లిన మంచు కుటుంబం ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... భోగిలో కోవిడ్ భస్మమైపోయిందన్నారు. టీటీడీలో అవినీతి రహిత పరిపాలన కొనసాగుతోందని మోహన్ బాబు పేర్కొన్నారు.