వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

ABN , First Publish Date - 2022-05-02T18:36:21+05:30 IST

వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

ఏలూరు: వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ హత్యకు సంబంధించి నిన్న ప్రధాన నిందితుడు బజారియాను విజయవాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటికీ బజారియాను అరెస్టును పోలీసులు చూపించలేదు. ఈ రోజు అరెస్టు చూపించి కోర్టులో హజరుపరిచే అవకాశం ఉంది. గంజి ప్రసాద్ హత్యకు సంబంధించి మొత్తం 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు బజారియా, ప్రత్యక్షంగా హత్య చేసిన వారితో సహా మొత్తం ఐదుగురు నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. మిగిలిన వారి కోసం మూడు బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-05-02T18:36:21+05:30 IST