ఎంపీ రఘురామ కృష్ణరాజుపై వైసీపీ నేత ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-07-13T16:09:14+05:30 IST
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లో ఎంపీ రఘురామ కృష్ణరాజుపై వైసీపీ పట్టణ అధ్యక్షుడు గుండుబోగుల నాగు ఫిర్యాదు చేశారు.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లో ఎంపీ రఘురామ కృష్ణరాజుపై వైసీపీ పట్టణ అధ్యక్షుడు గుండుబోగుల నాగు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను ఇసుక దొంగగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన నిరాధార వార్తలను వైసీపీ నేతలు ఖండించారు. 26 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిపై ఇటువంటి వాఖ్యలు చేయడం అమానుషమన్నారు. కాగా నాగు ఫిర్యాదును పోలీసులు తిరస్కరించారు. కోర్టు పరంగా తీసుకోవలసిన చర్యలని.. పోలీస్ స్టేషన్ పరిధిలోనిది కాదంటూ నిరాకరించారు.