చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి: అప్పిరెడ్డి

ABN , First Publish Date - 2021-04-17T20:07:48+05:30 IST

తిరుపతి ఉప ఎన్నికలో ఓటర్లను పక్కదారి పట్టించేలా తెలుగుదేశం నేతలు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి:  అప్పిరెడ్డి


అమరావతి: తిరుపతి ఉపఎన్నికలో ఓటర్లను పక్కదారి పట్టించేలా తెలుగుదేశం నేతలు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం టీడీపీ నేతలపై ఏపీ సీఈవో విజయానంద్‌కు అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తిరుపతి టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. వైసీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వెంకన్న స్వామివారి దర్శనం కోసం భక్తులు వస్తుంటే.. వారిని టీడీపీ నేతలు దొంగ ఓటర్లుగా చిత్రీకరిస్తున్నారని అప్పిరెడ్డి దుయ్యబట్టారు.

Updated Date - 2021-04-17T20:07:48+05:30 IST