కోడ్‌ను ఉల్లంఘిస్తున్న వైసీపీ నాయకులు

ABN , First Publish Date - 2021-01-25T05:58:50+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల ప్రవ ర్తనా నియమావళిని వైసీపీ నాయకులు ఉల్లంఘిస్తు న్నా రు. సీసీ రోడ్లకు భూమి పూజ తదితర కార్యక్ర మాలు కొన సాగిస్తున్నారు.

కోడ్‌ను ఉల్లంఘిస్తున్న వైసీపీ నాయకులు
వగ్గంపల్లిలో భూమి పూజ చేస్తున్న నాయకులు




కొనసాగుతున్న భూమి పూజలు

పామూరు, జనవరి 24 :  స్థానిక సంస్థల ఎన్నికల ప్రవ ర్తనా నియమావళిని వైసీపీ నాయకులు ఉల్లంఘిస్తు న్నా రు. సీసీ రోడ్లకు భూమి పూజ తదితర కార్యక్ర మాలు కొన సాగిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి శనివారం నుంచి కోడ్‌ అమలులోకి వచ్చింది. అయితే మండలంలోని వగ్గంపల్లి, దూబ గుంట, నిమ్మచెట్లపల్లి, గోపాలపురం, తదితర గ్రామాల్లో ఆదివారం వైసీపీ నాయకులు కోడ్‌ను లెక్కచేయకుండా  పార్టీ శ్రేణులతో ఆదివారం శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. సీసీ రోడ్ల నిర్మా ణానికి సంబంధిత అధికారులు లేకుం డానే భూమిపూజ చేయడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. కార్యక్రమానికి సంబం ధించిన ఫొటోలు, వీడియోలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని,  కోడ్‌ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ మండల నాయకులు డి మాండ్‌ చేస్తున్నారు.  


Updated Date - 2021-01-25T05:58:50+05:30 IST