ఉత్సాహంగా ‘కావటి’ ప్రచారం
ABN , First Publish Date - 2021-03-04T06:38:07+05:30 IST
రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో 20వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కావటి శివనాగ మనోహర్నాయుడు ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది.
ఆత్మీయ సమావేశాలతో పలువురి సంఘీబావం
ఇంటింటికీ వైసీపీ సంక్షేమ పథకాల ప్రచారం
గుంటూరు, మార్చి 3: రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో 20వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కావటి శివనాగ మనోహర్నాయుడు ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. డివిజన్ పరిధిలోని నల్లచెరువు, సంపత్నగర్, పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో ఆయన విస్తృత ప్రచారం చేస్తున్నారు. వివిధ సామాజికవర్గాల పెద్దలు ఆత్మీయ సమావేశాలతో తేనీటి విందు వంటి కార్యక్రమాలతో వారంతా కావటికి సంఘీబావం తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా సంపత్నగర్ అన్నపూర్ణ నిలయం అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఆత్మీయ సమావేశంలో శేషగిరి, ఉల్లి శివ, నరేంద్ర, మోహన్రావు, సుబ్బారావు ఇతర పెద్దలు కావటి మనోహర్ను ఘనంగా సత్కరించారు. కావటి మాట్లాడుతూ సంపత్నగర్వాసిగా ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానన్న ఆయన ఈనెల 10న జరిగే నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కావటి శంకరరావు, నారదాసు లక్ష్మణరావు, కంతేటి శ్యామ్, యర్రబాబు, షేక్ ఖాజామొహిద్దీన్, మంత్రి సాయి, రవి, వినయ్, ఉల్లి అనీల్కుమార్, ఉల్లి గణేష్కుమార్ తదితరులున్నారు.
మస్తానయ్యకు ‘కావటి’ ప్రత్యేక పూజలు
ఉరుసు మహోత్సవాలు పురస్కరించుకొని శ్రీహజరత్ కాలే మస్తాన్షా వలియా బాబా వారి దర్గాను కావటి మనోహర్నాయుడు బుధవారం సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక చద్దర్ను అలంకరించి గంధంతో పూజలు చేశారు. ఈ సందర్భంగా దర్గా అధినేత రావి రామ్మోహన్రావు స్వాగతం పలికారు.