వైసీపీకి నైతిక విలువలు లేవు

ABN , First Publish Date - 2022-08-08T05:30:00+05:30 IST

వైసీపీకి నైతిక విలువలు లేవు

వైసీపీకి నైతిక విలువలు లేవు
కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తున్న రవికుమార్‌

- టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌

పొందూరు: మహిళలంటే కనీసం గౌరవించని, నైతిక విలువలు లేని పార్టీ వైసీపీ అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ విమర్శించారు. రాపాక, పొం దూరు, లక్ష్మీపేట తదితర గ్రామాల్లో సోమవారం పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. మహిళను కించపరిచిన ఆ పార్టీ ఎంపీ గోరింట్ల మాధవ్‌ బాగో తం బయటపడినా కనీసం చర్యలు లేకపోవడం వైసీపీ విధానాలకు అద్ధం పడు తుందన్నారు. గతంలోను ఆ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రుల ఆడియోలు బయట పడ్డా కనీసం స్పందించలేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అసెంబ్లీలోనే మహిళ లను కించపరుస్తూ మాట్లాడిన ఘనత వైసీపీ నాయకులకే దక్కుతుందన్నారు.  పార్టీ మండల అధ్యక్షుడు రామ్మోహన్‌, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి శంకరభాస్కర్‌, పార్టీ నాయకులు బాడాన గిరి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-08T05:30:00+05:30 IST