వైసీపీ మినహా అన్ని పార్టీలు రైతు సభకు గ్రీన్ సిగ్నల్

ABN , First Publish Date - 2021-12-17T22:06:19+05:30 IST

కాసేపట్లో అమరావతి రైతుల బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఈ సభకు వైసీపీ మినహా అన్ని పార్టీల ప్రతినిధులు సభకు హాజరవుతున్నారు.

వైసీపీ మినహా అన్ని పార్టీలు రైతు సభకు గ్రీన్ సిగ్నల్

తిరుపతి: కాసేపట్లో అమరావతి రైతుల బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఈ సభకు వైసీపీ మినహా అన్ని పార్టీల ప్రతినిధులు సభకు హాజరవుతున్నారు. అమరావతి కోసం పోరాటం చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు పలు పార్టీలు, ప్రజా సంఘాల నేతలు వస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా రైతులకు సంఘీభావం తెలుపుతున్నారు. ప్రజా సంఘాలు, మేధావులు, ప్రవాసాంధ్రులు ఈ సభ పట్ల, తదనంతర పరిణామాల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఈ బహిరంగసభకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది.


కాంగ్రెస్‌ నుంచీ పీసీసీ అధ్యక్షుడు  తులసిరెడ్డి, సీపీఐ నుంచీ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తదితరులు హాజరవుతారని తెలిసింది. బీజేపీ,  సీపీఎం,జనసేన పార్టీల నుంచీ సభకు ఎవరు హాజరవుతారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. జనసేన నుంచీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ లేదా ముఖ్యనేత నాదెండ్ల మనోహర్‌లలో ఎవరో ఒకరు హాజరవుతారని చెబుతున్నారు.

Updated Date - 2021-12-17T22:06:19+05:30 IST