వైసీపీపై దారుణమై సెటైర్లు వేసిన టీడీపీ నేత
ABN , First Publish Date - 2020-07-01T03:38:04+05:30 IST
వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. అంశాలా వారీగా విమర్శలు
అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. అంశాల వారీగా విమర్శలు గుప్పించారు. ‘‘మూడు మాస్కులు అన్నారు క్వాలిటీ లేకపోయే.. మూడు రాజధానులు అన్నారు.. క్లారిటీ లేకపోయే.. మూడు రంగులు అన్నారు ఒక రంగుకి మిగిలిపోయే.. మొత్తానికి ఈ మూడు ఉన్నది వైసీపీ ప్రభుత్వానికి మాడు పగిలేందుకే అనుకుంటా’’ అని ఘాటైన సెటైర్లు వేశారు.