వైసీపీ ప్రభుత్వం పంచాయితీరాజ్ వ్యవస్థను నీరుగారుస్తోంది: అయ్యన్న
ABN , First Publish Date - 2021-07-27T01:57:27+05:30 IST
వైసీపీ ప్రభుత్వం పంచాయితీరాజ్ వ్యవస్థను నీరుగారుస్తోందని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు తప్పుబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
విశాఖ: వైసీపీ ప్రభుత్వం పంచాయితీరాజ్ వ్యవస్థను నీరుగారుస్తోందని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు తప్పుబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్పంచులను కీలుబొమ్మలుగా తయారు చేశారని ఎద్దేవాచేశారు. పంచాయతీ రాజ్శాఖ అధికారులు పెత్తనం చేస్తున్నారని, గతంలో ప్రత్యేక అధికారుల పాలనలో నిధులు దుర్వినియోగం చేశారని తెలిపారు. పాత చెక్కులపై సర్పంచ్లను సంతకాలు పెట్టమంటున్నారని, లేదంటే చెక్ పవర్ రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని అయ్యన్నపాత్రుడు చెప్పారు.