వైసీపీ ప్రభుత్వ గూండాగిరిని ఎదుర్కొంటాం: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2022-06-10T00:53:48+05:30 IST

వైసీపీ ప్రభుత్వ గూండాగిరిని దీటుగా ఎదుర్కొంటామని బీజేపీ నేత సోము వీర్రాజు ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

వైసీపీ ప్రభుత్వ గూండాగిరిని ఎదుర్కొంటాం: సోము వీర్రాజు

ఆత్మకూరు: వైసీపీ ప్రభుత్వ గూండాగిరిని దీటుగా ఎదుర్కొంటామని బీజేపీ నేత సోము వీర్రాజు ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అధికారుల అంతు చూస్తానని బెదిరిస్తే ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం గూండాగిరిని చెలాయిస్తూ, పోలీసులను ఉసిగొల్పుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని సోము వీర్రాజు తెలిపారు. 

Updated Date - 2022-06-10T00:53:48+05:30 IST