ఉద్యోగులను బుజ్జగించేందుకు వైసీపీ సర్కారు ఎత్తులు
ABN , First Publish Date - 2022-01-11T02:55:22+05:30 IST
రాష్ట్రంలోని ఉద్యోగులను బుజ్జగించేందుకు వైసీపీ సర్కారు
అమరావతి: రాష్ట్రంలోని ఉద్యోగులను బుజ్జగించేందుకు వైసీపీ సర్కారు ఎత్తులు వేసింది. అగమేఘాలపై ఇళ్ల స్థలాలకు సంబంధించిన నోట్ ఫైల్ను మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ శాఖకు ప్రభుత్వం పంపింది. జగనన్న స్మార్ట్ టౌన్షిప్లలో 10 శాతం ప్లాట్లను ప్రభుత్వ ఉద్యోగులకు రిజర్వ్ చేయాలని, 20 శాతం రిబేట్తో వాటిని అందించాలని నోట్లో పేర్కొంది. నోట్ను సంబంధిత శాఖాధికారులకు ప్రభుత్వ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ పంపారు.