బ్యాంక్ ద్వారా మెరుగైన సేవలు అందించండి: మంత్రి
ABN , First Publish Date - 2021-07-25T06:00:21+05:30 IST
ది దుర్గా కో-ఆపరేటివ్ బ్యాంకు ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర మైనార్టీస్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్లు కోరారు.
బ్యాంక్ ద్వారా మెరుగైన సేవలు అందించండి: మంత్రి
భవానీపురం, జూలై 24 : ది దుర్గా కో-ఆపరేటివ్ బ్యాంకు ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర మైనార్టీస్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్లు కోరారు. ఈద్ మిలాప్ సందర్భంగా శనివారం గాలీబ్ షహీద్ దర్గా వద్ద బ్యాంకు చైర్మన్ అబ్ధుల్ రెహమాన్ ఆధ్వర్యంలో వైసీపీ ఆత్మీయ కలయిక కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని రెహమాన్, ఆసిఫ్లను సత్కరించారు. మైనార్టీ నాయకులు జీఎంసీ బాలయోగి, కార్పొరేటర్ మహ్మద్ ఇర్ఫాన్, అర్హద్, యరడ్ల ఆంజనేయరెడ్డి, నాయకులు జీఎంసీ బాబు, అల్తాఫ్లు పాల్గొన్నారు.