సవాలును స్వీకరించే దమ్ము వైసీపీకి లేదు
ABN , First Publish Date - 2020-08-09T12:18:05+05:30 IST
టీడీపీ అధినేత విసిరిన సవాలను స్వీకరించే దమ్ము వైసీపీ నాయకులకు..
మాజీ ఎంపీ శ్రీరామ్మాల్యాద్రి
బాపట్ల(గుంటూరు): టీడీపీ అధినేత విసిరిన సవాలను స్వీకరించే దమ్ము వైసీపీ నాయకులకు, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి లేదని మాజీ ఎంపీ శ్రీరామ్మాల్యాద్రి పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ర్టాభివృద్ది కోసమే అమరావతిని రాజధానిగా చేయటం జరిగిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయటం సరికాదన్నారు. దీనిపై అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.