28న వైసీపీ జిల్లా ప్లీనరీ

ABN , First Publish Date - 2022-06-26T06:11:29+05:30 IST

వైసీపీ తిరుపతి జిల్లా ప్లీనరీ సమావేశం ఈనెల 28న నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి తెలిపారు.

28న వైసీపీ జిల్లా ప్లీనరీ
జిల్లా ప్లీనరీ కోసం ఎస్వీయూ స్టేడియాన్ని పరిశీలిస్తున్న చెవిరెడ్డి

తిరుపతి, జూన్‌25(ఆంధ్రజ్యోతి): వైసీపీ తిరుపతి జిల్లా ప్లీనరీ సమావేశం ఈనెల 28న నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి తెలిపారు. శనివారం ఎస్వీయూ తారకరామ స్టేడియాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ ఎస్వీయూ స్టేడియం వేదికగా 10వేల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్లీనరీ నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశం తరహాలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందని, పలువురు పార్టీ ప్రముఖులు, పెద్దలు హాజరుకానున్నట్లు చెప్పారు. ఈసందర్భంగా ఏర్పాట్లపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

Updated Date - 2022-06-26T06:11:29+05:30 IST