మైనార్టీలను మోసగించిన వైసీపీ: టీడీపీ
ABN , First Publish Date - 2022-06-25T06:22:28+05:30 IST
ముఖ్యమంత్రి జగన అధికారంలోకి వచ్చాక మై నార్టీలకు తీరని అన్యాయం చేశారని తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ నాయకులు మం డిపడ్డారు.
హిందూపురం టౌన, జూన 24: ముఖ్యమంత్రి జగన అధికారంలోకి వచ్చాక మై నార్టీలకు తీరని అన్యాయం చేశారని తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ నాయకులు మం డిపడ్డారు. శుక్రవారం స్థానిక ప్రెస్క్లబ్లో నాయకులు విలేకరులతో మాట్లాడారు. దుల్హన పథకానికి చెక్ పెట్టారని, విదేశీ విద్యకు మంగళం పాడారని, రంజాన, బక్రీదు తో ఫాలు కనుమరుగు చేశారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం మైనార్టీలకు వ్యతిరేకమన్నారు. ఏఒక్క మైనార్టీ పథకం అమలు చేయలేదన్నారు. తెలుగుదేశం హయాంలో మై నార్టీలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధికి బాటలు వేశారని అన్నారు. నిధుల సాకుతో దుల్హన పథకాన్ని అటకెక్కిస్తున్న కోర్టులో స్పష్టం చేసిన వైసీపీ ప్రభుత్వ నిజస్వరూపం బయట పడిందన్నారు. యువతకు ఉపాధి యూనిట్లు, విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్న హామీలు ఏమయ్యా యని ప్రశ్నించారు. ఢిల్లీలో బీజేపీతో చట్టాపట్టాలు వేసుకుని వారికి మద్దతు తెలుపుతున్న వైసీపీ... రాష్ట్రంలో మైనార్టీలను వంచించేందుకు కపట ప్రేమ చూపుతున్నారన్నారు. సమావేశంలో టీడీపీ పట్టణ కన్వీనర్ రమేష్, రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎంఎస్ షఫీ, అమర్నాథ్, రషీద్, సింగరెడ్డిపల్లి బాబా, హిదయతుల్లా, దాదు, నజీర్ పాల్గొన్నారు.