కృష్ణా: జగ్గయ్యపేటలో ఓ మహిళ బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది..ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను రక్షించారు. ఇటీవల జరిగిన జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నుంచి కౌన్సిలర్గా గెలిచిన నూకల సాంబశివరావు తల్లి మంగతయారు ఈ దారుణానికి పాల్పడటం స్థానికంగా సంచలనం రేపింది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.