టీడీపీ మాజీ కౌన్సిలర్‌పై వైసీపీ కౌన్సిలర్‌ దాడి

ABN , First Publish Date - 2021-04-17T09:42:07+05:30 IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ మైనార్టీ నాయకుడు, మాజీకౌన్సిలర్‌ ముల్లా కలీముల్లాపై 15వ వార్డు వైసీపీ కౌన్సిలర్‌ ఇసాక్‌, ఆయన వర్గీయులు శుక్రవారం దాడి చేశారు.

టీడీపీ మాజీ కౌన్సిలర్‌పై వైసీపీ కౌన్సిలర్‌ దాడి

 ఎమ్మిగనూరు, ఏప్రిల్‌ 16: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ మైనార్టీ నాయకుడు, మాజీకౌన్సిలర్‌ ముల్లా కలీముల్లాపై 15వ వార్డు వైసీపీ కౌన్సిలర్‌ ఇసాక్‌, ఆయన వర్గీయులు శుక్రవారం దాడి చేశారు. బాధితుడి కథనం మేరకు.. ముల్లా కలీముల్లా కోర్టు సమీపంలో ఉన్న మసీదులో నమాజు ముగించుకుని బయటకు వచ్చి తన బంధువుతో మాట్లాడుతుండగా.. అటుగా వచ్చిన వైసీపీ కౌన్సిలర్‌ ఇసాక్‌ చూస్తూ వెళ్లారు. తిరిగి వచ్చి తనను చూసి ఏదో అన్నావంటూ కలీముల్లాతో వాగ్వాదానికి దిగారు. తర్వాత కౌన్సిలర్‌తో పాటు ఆయన వర్గీయులు కలీముల్లాపై దాడి చేశారు. కలీముల్లా వెంటనే పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు   సోమప్ప సర్కిల్‌ వద్ద ఆందోళన చేశారు.  

Updated Date - 2021-04-17T09:42:07+05:30 IST