-
-
Home » Andhra Pradesh » ycp corruption Employees-MRGS-AndhraPradesh
-
ycp పెద్దల అవినీతి.. ఉద్యోగుల పాలిట శాపంగా మారుతోంది: అశోక్బాబు
ABN , First Publish Date - 2022-05-07T22:31:06+05:30 IST
ycp పెద్దల అవినీతి.. ఉద్యోగుల పాలిట శాపంగా మారుతోంది: అశోక్బాబు
అమరావతి: వైసీపీ పెద్దల అవినీతి.. ఉద్యోగుల పాలిట శాపంగా మారుతోందని టీడీపీ నేత అశోక్బాబు (Ashok Babu) విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 1న జీతాలు ఇప్పించలేని ఉద్యోగ సంఘాల నేతలతో లాభమేంటి? అని ప్రశ్నించారు. ఆదాయం పెరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు అప్పులు చేస్తోంది? అని ప్రశ్నించారు. జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థలో ఇబ్బందులున్నాయని సాకు చూపుతున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పెండింగ్లో పెడుతున్నారని చెప్పారు. నవంబర్లో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కూడా డబ్బుల ఇవ్వలేదని తెలిపారు. మూడు నెలలుగా అంగన్వాడీలకు వేతనాలు లేవని అశోక్బాబు చెప్పారు.