‘సాహో చంద్రబాబు’పై వైసీపీ ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-04-17T09:41:33+05:30 IST

తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నేతలపై సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీపై చర్యలు తీసుకోవాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు.

‘సాహో చంద్రబాబు’పై వైసీపీ ఫిర్యాదు

అమరావతి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నేతలపై సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీపై చర్యలు తీసుకోవాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు. ‘‘చంద్రబాబు, లోకేశ్‌ పర్యవేక్షణలో సోషల్‌ మీడియా(ఫే్‌సబుక్‌) వేదికగా సాహో చంద్రబాబు పేరుతో ఇది సాగుతోంది. వైసీపీ నేతలు పెద్దిరెడ్డి, వేమిరెడ్డి కృష్ణపట్నం నుంచి సత్యవేడు వరకు సెజ్‌ కోసం భూములు లాక్కుంటారని ప్రచారం చేయిస్తున్నారు’’ అని ఫిర్యాదు చేశారు.  

Updated Date - 2021-04-17T09:41:33+05:30 IST