AP News: ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్‌ను ప్రజలు ఆపాలి: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-07-29T22:33:07+05:30 IST

వరద, బురదతో ప్రజల ఇళ్లల్లో ఫ్యాన్ ఆగిందని, ఎన్నికల్లో వైసీపీ (YCP) ఫ్యాన్‌ను ప్రజలు ఆపాలని టీడీపీ అధినేత చంద్రబాబు

AP News: ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్‌ను ప్రజలు ఆపాలి: చంద్రబాబు

అమరావతి: వరద, బురదతో ప్రజల ఇళ్లల్లో ఫ్యాన్ ఆగిందని, ఎన్నికల్లో వైసీపీ (YCP) ఫ్యాన్‌ను ప్రజలు ఆపాలని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పిలుపునిచ్చారు. శుక్రవారం ఏపీ విలీన మండలాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మీట్లాడుతూ పోలవరం పూర్తి చేయడం చేతకాకపోతే సీఎం జగన్‌ (CM Jagan) రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ఎందుకు పూర్తికాదో తాను చూస్తానని హెచ్చరించారు. జగన్‌రెడ్డికి కుట్రలు, కుతంత్రాలు తప్ప ఇంకేమీ తెలీదని దుయ్యబట్టారు. డ్రైవర్‌ను చంపి ఇంటికి మృతదేహాన్ని పంపే ధైర్యం.. జగన్‌రెడ్డి నాయకులకు ఇచ్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏపీ, తెలంగాణలోని గోదావరి ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు  పర్యటిస్తున్నారు.

Updated Date - 2022-07-29T22:33:07+05:30 IST