రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోంది: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-10-29T22:02:05+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదని హెచ్చరించారు.

రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోంది: చంద్రబాబు

చిత్తూరు: రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదని హెచ్చరించారు. తన పర్యటనకు వైసీపీ ప్రభుత్వం అడగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ అధినేత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ అధర్మ పాలనపై తాను చేసేది ధర్మపోరాటమని ఆయన అన్నారు. తన సొంత నియోజక వర్గమైన కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన బహిరంగ సభలో మాట్లాడారు.  రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.


కొందరు అధికారులు, పోలీసులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చిరించారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. అక్రమ కేసులకు టీడీపీ నేతలు భయపడరని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర, ఎరువులు ఇవ్వడం లేదని తప్పుబట్టారు. సీఎం జగన్‌రెడ్డి ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.


Updated Date - 2021-10-29T22:02:05+05:30 IST