లడ్డూలాంటి ఐడియా!

ABN , First Publish Date - 2020-06-05T10:03:47+05:30 IST

‘కరోనా వల్ల వెంకన్న దర్శనం ఎలాగూ కుదరడంలేదు... కనీసం శ్రీవారి ప్రసాదమైనా భక్తులకు అడిగినన్ని అందుబాటులో ఉంచుతాం’ అని టీటీడీ లడ్డూలు విక్రయిస్తోంది. ఈ వెసులుబాటును గుంటూరుకు చెందిన

లడ్డూలాంటి ఐడియా!

  • శ్రీవారి ప్రసాదంతో వైసీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి ఎన్నికల ప్రచారం

గుంటూరు, జూన్‌  4 (ఆంధ్రజ్యోతి): ‘కరోనా వల్ల వెంకన్న దర్శనం ఎలాగూ కుదరడంలేదు... కనీసం శ్రీవారి ప్రసాదమైనా భక్తులకు అడిగినన్ని అందుబాటులో ఉంచుతాం’ అని టీటీడీ లడ్డూలు విక్రయిస్తోంది. ఈ వెసులుబాటును గుంటూరుకు చెందిన వైసీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి తన ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. బ్రాడీపేటలోని వార్డు నుంచి బరిలోకి దిగిన ఆ నేత... పెద్దసంఖ్యలో లడ్డూలు కొన్నారు. వాటిని ఇంటింటికీ పంచుతూ... ‘మీ ఓటు మాకే వెయ్యండి’ అంటూ అభ్యర్థిస్తున్నారు. ఈ ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టారు. శుక్రవారం పార్టీ పెద్దలను కూడా పిలిచి వారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2020-06-05T10:03:47+05:30 IST